బాబు పాలనకు రోజులు దగ్గరపడ్డాయి

అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కల్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌ విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని కల్యాణదుర్గం మండలం దేవాదులకుండలో ఉషశ్రీచరణ్‌ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య ప్రధానంగా ఉందని ప్రజలు చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. 
Back to Top