మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బాబుకు కౌంట్ డౌన్ మొదలైందిః ఉషా చరణ్
04 Oct 2016 12:09 PM
రైతుధర్నా: అనంతపురంలో అసలు కరువన్నదే లేదన్న చంద్రబాబు ...ఇవాళ రైతుధర్నాలో పాల్గొన్న వేలాది మంది కరువు రైతులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని కళ్యాణదుర్గం నియోజవకర్గ సమన్వయకర్త ఉషా చరణ్ అన్నారు. రైతుధర్నాలో ఆమె మాట్లాడుతూ... ఆరు రెయిన్గన్లను ఇచ్చానని చెబుతున్న చంద్రబాబు నీరు లేనప్పుడు రెయిన్గన్లు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తానన్న హామీ గంగలో కలిసిందన్నారు.
రైతులకు భీమా సౌకర్యం కల్పించకుండా, ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతులను అదోగతి పాలు చేస్తున్నాడని ఆమె ధ్వజమెత్తారు. బాబు రెండున్నరేళ్ల పరిపాలనలో రైతులను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికల వస్తాయా... జగనన్నకు ఎప్పుడు ఓటు వేయాలని ప్రజలందరు అడుగుతున్నారని ఆమె చెప్పారు. బాబు ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని.... రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని, 2019లో వైయస్సార్సీపీ అధికారంలో రావడం తథ్యమన్నారు.