పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలి- పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

హైదరాబాద్:

  పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని వైయస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే , పిఎసి ఛైర్మన్ బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం ప్రాజక్టుకయ్యే ఖర్చునంతా కేంద్రమే భరించాలని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.   స్వార్థ ప్రయోజనాల కోసమే టిడిపి ప్రభుత్వం ఈ పనులను భుజాన వేసుకుందని ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనల వల్ల పనుల్లో పురోగతి ఏమీ లేదని, కేవలం ప్రచార ఆర్భాటమే కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

Back to Top