చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
గోడ మీది పిల్లిలా సిఎం కిరణ్కుమార్ తీరు
09 Aug 2013 3:50 PM
గుంటూరు, 9 ఆగస్టు 2013 :
రాష్ట్ర విభజనకు అనుకూలమని గానీ, వ్యతిరేకమని గానీ స్పష్టంగా చెప్పకుండా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి గోడమీద పిల్లిలా వ్యవహరించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎం.పి. ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత తగాదాలతో రాష్ట్రంలో చిచ్చు రగిల్చారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై కిరణ్కుమార్రెడ్డి మీడియా సమావేశం పెట్టి సుదీర్ఘ వివరణ ఇవ్వడాన్ని ఉమ్మరెడ్డి ఎద్దేవా చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా సిఎం తీరు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.