జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
వైఎస్ జగన్ కు ఓ రికార్డ్ ఉంది
09 Dec 2015 4:14 PM
విశాఖపట్నంః ఎన్నికల సమయంలో మద్యపానం నిషేధిస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసగించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కల్తీమద్యంతో మరణాలు సంభవించి కుటుంబం పెద్ద దిక్కు కోల్పోతున్న నేపథ్యంలో మహిళలు ఎన్నోసార్లు ఉద్యమాలు జరిపారని..ఐనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మద్యపానం వల్ల జరుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకొని నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఓ రికార్డ్ ఉందని, ఆయన ఏదైనా మాట ఇచ్చారంటే అది తప్పకుండా అమలవుతుందనేది ప్రజల విశ్వాసమని ఉమ్మారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. మద్యపాన నిషేధం జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారని ఉమ్మారెడ్డి ప్రకటించారు. మద్యం వల్లే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ప్రభుత్వం దురాలోచన చేస్తోందని దుయ్యబట్టారు. సామాన్య ప్రజలు అనారోగ్యం పాలవడం తప్ప దాని వల్ల ఒరిగేదేమీ లేదన్నారు.