రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీకి తీరని నష్టం
12 May 2016 1:48 PM
హైదరాబాద్ః కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్ట్ లతో ఏపీ ఎడారిగా మారే ప్రమాదముందని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గత సంవత్సర కాలం నుంచి నీటి ప్రాజెక్ట్ లు, ఎత్తిపోతల పథకాలు కడుతున్నారని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం వాటిని నిలువరించలేకపోవడం దారుణమన్నారు.
తెలంగాణలో నిర్మించబోయే ప్రాజెక్ట్ లకు బాబు అభ్యంతరాలు తెలపకపోవడం చాలా బాధకరమన్నారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఉమ్మారెడ్డి కోరారు. దీనిలో భాగంగానే నీటివనరుల తీవ్రతను, రాబోయే పెనుముప్పును తెలియజెప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కర్నూలులో ఈనెల 16 నుంచి మూడ్రోజుల పాటు జలదీక్ష చేపడుతున్నట్లు ఉమ్మారెడ్డి ప్రకటించారు. 17వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. దీక్షను విజయవంతం చేయాలని కోరారు.
To read this article in English: http://bit.ly/1OkAp11