ఉద్యోగుల ఆందోళనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ మద్దతు

హైదరాబా‌ద్, 9 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షరతులతో సంబంధం లేకుండా హెల్తు కార్డులు జారీ చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా‌ పక్షం డిమాండ్ చేసింది. ‌రెండు లక్షల రూపాయల వ్యయ పరిమితిని ఎత్తివేయాలని ప్రభుత్వానికి పార్టీ నాయకులు సూచించారు. హెల్తుకార్డుల జారీ, ఇతర సమస్యలపై ఉద్యోగులు చేపట్టే ఆందోళనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా‌ పక్షం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
Back to Top