వంగవీటి రంగాకు రాధా ఘన నివాళి

విజయవాడ: వంగవీటి మోహన రంగా 69వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా  ఘనంగా నివాళులు అర్పించారు. బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి వంగవీటి రాధా పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రంగా ఆశయసాధనకు కృషి చేస్తానని తెలిపారు.  తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు కార్యకర్తలకు తానెంతో రుణపడి ఉన్నానని చెప్పారు.

Back to Top