నారాయణరెడ్డికి వైయస్‌ జగన్‌ నివాళి

పత్తికొండ:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర  17వ రోజు పత్తికొడ నియోజకవర్గంలో కొనసాగుతుంది. జననేతకు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలంతా తండోపతండాలుగా తరలివస్తున్నారు. కాగా.. చెరుకులపాడులో టీడీపీ నేతల చేతులో హత్యకు గురైన నారాయణరెడ్డి సమాధి వద్ద వైయస్‌ జగన్, నారాయణరెడ్డి సతీమణి, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీదేవి నివాళులర్పించారు. 

Back to Top