నేడు ముస్లింల ఆత్మీయ సదస్సు


ఆరిలోవ క్యూ–1 ఆస్పత్రి పక్కన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజ కవర్గ పరిధిలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో చినగదిలి వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదçస్సు జరుగుతుంది.  ఈ సదస్సులోపెద్ద సంఖ్యలో ముస్లిం సామా జికవర్గానికి చెందిన పెద్దలు, ప్రముఖు లు, ప్రతినిధులు పాల్గొన‌నున్నారు.  చినగదిలి నుంచి ఆరిలోవకు వెళ్లే దారిలో క్యూ–1 ఆస్పత్రి పక్కన జరుగనున్న ఈ ప్రత్యేక సమావేశంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 261వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం బీచ్‌రోడ్‌లోని కామ‌త్ హోట‌ల్ నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి ఉషోద‌యం జంక్షన్, టీటీడీ ఫంక్షన్‌ హాలు, ఎంవీపీ కాలనీ, ఎంవీపీ డబల్‌ రోడ్డు, వెంకోజీపాలెం పెట్రోల్‌ బంక్‌ జంక్షన్, హనుమంతవాక జంక్షన్, ఆరిలోవ జంక్షన్‌ మీదుగా చినగదిలి వరకు సాగుతుంది.  

Back to Top