తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ప్రచారం

కాకినాడ:

శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్ర నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ‘వైయస్ఆర్ జనభేరి’ ‌ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. శ్రీ జగన్ పర్యటన వివరాలను పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆదివార‌ం నాడు కాకినాడలో వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మీదుగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంట‌ర్‌కు శ్రీ వైయస్‌ జగన్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభకు హాజరయ్యే అశేష ప్రజా వాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని రఘురామ్, చిట్టబ్బాయి తెలిరు.

Back to Top