వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
'విశాఖ'లో నేడు జగన్ సమైక్య శంఖారావం
08 Feb 2014 1:08 PM
విశాఖపట్నం :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి శ్రీ జగన్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా చోడవరం వెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.
అనంతరం చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడి సభలో శ్రీ వైయస్ జగన్ ప్రసంగిస్తారు. తరువాత ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్సు గార్డెన్సులో జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి శ్రీ జగన్ హాజరవుతారు.