పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
చంద్రబాబు అవివేకానికి నిదర్శనం
11 Dec 2015 4:22 PM
విజయవాడః వరద ముంపు, భూకంపాల జోన్ గా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకోవడం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి ఆరోపించారు. తుళ్లూరును రాజధాని ఎంపికచేయడం ప్రజ్లలో గందరగోళాన్ని సృష్టించేదిగా ఉందన్నారు. కృష్ణానది అనేక సార్లు ఈప్రాంతాన్ని వరదలతో ముంచెత్తిన సంగతి తెలిసిందేనన్నారు. వరద ముంపుతో జలమయమైన ప్రాంతంలో వేలాది కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేస్తాననడం సరికాదన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధానికి పంట భూములు తీసుకోవద్దని చెప్పిన విషయాన్ని గౌతంరెడ్డి ఈసందర్భంగా గుర్తు చేశారు. భూంకపాల జోన్ గా ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే వేలాది కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతుందన్నారు. అదేవిధంగా చెన్నై, ముంబైలలో వరదలు రాజధానిని ఎలా ముంచెత్తాయో చూసి దాన్నుంచైనా చంద్రబాబు గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఆస్తి, ప్రాణ నష్టాలతో పాటు పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని, దీనివల్ల భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసిన వారమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.