చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరిక
వరదలతో రాజధానికి ముప్పు
15 Sep 2016 6:04 PM
న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగుతున్నాయి. వరదలనివారణకు అమరావతిలోని 10 వేల ఎకరాల భూమిని 25 మీటర్ల ఎత్తు పెంచుతామంటున్నారని, అది ఎలా సాధ్యమని పిటిషనర్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సంజయ్ పరేఖ్ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ఎంచుకున్న స్థలం విషయంలోనే అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. కొండవీటి వాగు, కృష్ణా వరదలతో రాజధానికి ముప్పు ఏర్పడుతుందని వివరించారు.
అమరావతి ప్రాంతం సముద్రమట్టానికి 21.7 మీటర్ల ఎత్తులో ఉందని.. కానీ వరదల సమయంలో కృష్ణానది 25 మీటర్ల ఎత్తు పెరుగుతుందని సంజయ్ పరేఖ్ వివరించారు. అమరావతిలో 10వేల ఎకరాలకు ముంపు ప్రమాదం ఉందని పర్యావరణ మదింపు నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ పదివేల ఎకరాల భూమిని 25 మీటర్ల ఎత్తు ఎలా పెంచుతారని పరేఖ్ ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది గంగూలీ తడబడ్డారు. అనంతరం విచారణ రేపటికి వాయిదా పడింది.