కురుపాంలో వైయస్సార్సీపీలో చేరిన యువకులు

విజయనగరంః జిల్లాలో వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. కురుపాం నియోజకవర్గంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి సమక్షంలో పెద్ద ఎత్తున యువత పార్టీలో చేరారు. టీడీపీ  నుంచి సుమారు 100 మంది కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు అవినీతి పాలనతో విసిగిపోయిన టీడీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులవుతున్నారు.

Back to Top