పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
పట్టిసీమ నీళ్లు సముద్రం పాలు
21 Mar 2017 10:19 AM
ఏపీ అసెంబ్లీ: పట్టిసీమ నుంచి తెచ్చిన 55 టీఎంసీల నీళ్లు సముద్రంపాలు చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమ లిప్టింగ్ కోసం రూ.136 కోట్ల విద్యుత్ బిల్లులు కట్టిన ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింది రూ.120 కోట్లు తెలంగాణకు కట్టి ఉంటే పులిచింతలలో 40 టీఎంసీలు స్టోర్ చేసే అవకాశం ఉండేదని వైయస్ జగన్ చెప్పారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత నీటి సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి నీళ్లు తెచ్చామని, అలా తెచ్చిన నీళ్లు సముద్రంలో కలిపేశారని విమర్శించారు.
అదేవిధంగా పట్టిసీమ నుంచి తెచ్చిన 40 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తరలిస్తే కృష్టా బేసిన్లో 40 శాతం ఇన్ఫ్లో తగ్గిపోయిందని చెప్పారు. శ్రీశైలంలో 584 టీఎంసీల నీరున్నా.. రాయలసీమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గండికోటలో 26 టీఎంసీలు, పైడీపాలెం, సర్వరాయసాగర్, వాయికొండలో నీరు నిల్వ చేసుకోవచ్చు అన్నారు. గండికోటకు 6 టీఎంసీలు తెచ్చి కడపకు నీరు ఇచ్చారని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. గండికోటకు గతంలోనే కలెక్టర్ నీరు తీసుకొనివచ్చారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మంత్రి దేవినేని ఉమ లేచి పొంతన లేని విషయాలతో సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు.