చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
డబ్బు సంచులతో మంత్రుల ప్రలోభాలు
10 Aug 2017 9:49 AM
నంద్యాలః రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి మంత్రులు డబ్బు సంచులతో నంద్యాలలో కూర్చొని ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. స్వయాన ముఖ్యమంత్రి నంద్యాలకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే...ఓటుకు రూ. 5వేలు ఇస్తానని చెబుతున్నాడంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. నా పెన్షన్లు, నా రోడ్ల మీద తిరుగుతున్నారని మాట్లాడుతున్నారు. నీ జేబులోంచి తీసిచ్చావా బాబు డబ్బులు అంటూ ఫైర్ అయ్యారు. నంద్యాలలో ఉపఎన్నిక రాబట్టే బాబు, మంత్రులు రోడ్లమీద తిరుగుతున్నారని, ఉపఎన్నిక లేకపోతే వాళ్లు ఒక్కసారైనా నంద్యాలకు వచ్చేవారా అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని జోగి అన్నారు. నంద్యాల ఉపఎన్నిక వచ్చిందనే రూ. 2వేల కోట్ల జీవోలిచ్చారని, తర్వాత బాబు, మంత్రులు ఎవరూ కనబడరని ఎద్దేవా చేశారు. జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయతతో, ప్రేమగా దీవిస్తున్నారని, నంద్యాల ప్రజలు వైయస్సార్సీపీని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు.