టీడీపీ నీచ ప్రవృత్తి బయటపడింది..!

గుంటూరుః వైఎస్సార్సీపీ నేత పార్థసారథి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన దీక్షను భగ్నం చేయడంతో టీడీపీ నీచ ప్రవృత్తి బయటపడిందని పార్థసారథి విమర్శించారు.  రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్  పోరాటం చేస్తుంటే.. దాన్ని ఎలా భగ్నం చేయాలా అన్న రాజకీయ కోణంలో టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించారని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు.

ప్రభుత్వం దీక్ష  భగ్నం చేసినా... వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష విజయవంతం అయిందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన తెలిపారు. దీని ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా అంశాన్ని టీడీపీ పతలు ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారన్నది స్పష్టంగా అందరికీ తెలిసిందని, జగన్ దీక్షతో ఈ విషయం మొత్తం ప్రజల్లోకి వెళ్లిందని పార్థసారథి అన్నారు. ఇక ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో  ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.
Back to Top