కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
టిడిపి ఎంపిల నిజ స్వరూపం వెల్లడైంది
15 Oct 2013 3:14 PM
విజయవాడ, 15 అక్టోబర్ 2013:
లోక్సభ స్పీకర్ కార్యాలయం నోట్తో వచ్చన నేపథ్యంలో రాజీనామాల విషయంలో టిడిపి ఎంపిల నిజస్వరూపం మొత్తం వెల్లడైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాగే ఎంపిలు కూడా తమ దొంగ బుద్ధిని ప్రదర్శించారని, సమైక్యాంధ్ర విషయంలో వానిరి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయం నోట్ రావడంతో బట్టబయలైందని ఆయన విమర్శించారు. సమైక్యవాదానికి టిడిపి కట్టుబడి లేదన్న విషయాన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని రమేష్ అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందని జోగి రమేష్ అన్నారు.