‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
టీడీపీ ఎమ్మెల్యే బండారం బయటపెడతా
10 Jun 2017 3:40 PM
నెల్లూరు: అధికార అండతో టీడీపీ నేతలు విలువైన భూములను ఆక్రమించుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ధ్వజమెత్తారు. కొవ్వూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా టీడీపీ తొత్తులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి భూ కబ్జాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, విచారణ చేపడితే ఆ ఆధారాలను బయటపెడతానని ప్రసన్నకుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని భూదందాపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.