మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రెచ్చిపోయిన పచ్చనేతలు..కార్పొరేషన్ లో కుర్చీల లొల్లి
31 Dec 2016 12:45 PM
కడప మునిసిపల్ కార్పొరేషన్ లో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. కుర్చీల కోసం బాహాబాహీకి దిగారు. తాము చెప్పినట్లు కుర్చీలు వేయలేదంటూ సమావేశంలో టీడీపీ సభ్యులు నానా రభస చేశారు. టీడీపీ నేతలు మేయర్ పోడియం వద్దకు ఆగ్రహంగా దూసుకెళ్లారు. వారిని అడ్డుకోబోయిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై దాడికి యత్నించారు. తమకు కుర్చీలు వేయలేదంటూ ఆవేశంతో మైకులు విరగొట్టారు. మేయర్, వైయస్ఆర్ సీపీ సభ్యులు నచ్చజెప్పినా.. టీడీపీ సభ్యులు వినకుండా గొడవకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.