రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
దేవుడి భూములను కూడా టీడీపీ నేతలు వదలడం లేదు
29 Mar 2018 12:48 PM
గుంటూరు: టీడీపీ నాయకులు దేవుడి భూములను కూడా వదలడం లేదని వైయస్ఆర్సీపీ పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం పెదకూరపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు, దారుణాలకు అంతే లేకుండా పోయిందన్నారు. 600 హామీలను ఎన్నిలకు ముందు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సీఎం చంద్రబాబు నాలుగేళ్లలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. నాడు తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా తెస్తామన్న చంద్రబాబు ఈ రోజు ప్యాకేజీని స్వాగతించారన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ దేవుడి భూములను కూడా వదల్లేదన్నారు. సదావర్తి సత్రం భూములను స్వాహా చేశారన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వేలాది లారీల్లో ఇసుకను తరలిస్తూ టీడీపీ నేతలు లక్షలాది రూపాయలు సంపాదించారన్నారు. నీరు–చెట్టు, పుష్కరాల పేరుతో దోచుకుతింటున్నారని విమర్శించారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఇదే రోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మన నియోజకవర్గానికి వచ్చారని గుర్తు చేశారు.