రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విశాఖలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు
29 Apr 2017 1:11 PM
విశాఖపట్నంః చంద్రబాబు అవినీతి పరిపాలనను సహించలేక, టీడీపీలో కొనసాగలేక ఆ పార్టీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని వైయస్ఆర్ సీపీ పాయకారావుపేట నియోజకవర్గ సమన్వయకర్త గొల్ల బాబురావు స్పష్టం చేశారు. పాయకారావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి మండలం టీపీపాలెం, రామాపురం గ్రామాలకు చెందిన 200 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కోఆర్డినేటర్లు గొల్ల బాబురావు, వీసం రామకృష్ణలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ... ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తుందని, అందుకు ఈ వలసలే నిదర్శనమన్నారు.