‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
వైయస్సార్సీపీలో చేరిన బనగానపల్లె తమ్ముళ్లు
12 Dec 2016 11:53 AM
కర్నూలుః సంజామల మండలం అక్కంపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు భారీగా వైయస్సార్సీపీలో చేరారు. మల్లేష్ రెడ్డి , చక్రపాణి రెడ్డి , నాగేశ్వర్ రెడ్డి, కేశాలు రెడ్డి,చంద్ర మోహన్ రెడ్డిలతో పటు మరో 50 కుటుంబాలు వైయస్సార్సీపీలో చేరాయి. నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అక్కం పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీకి జెండా కట్టే నాధుడే లేని సమయంలో తాము ముందుండి పార్టీ కోసం కష్టపడి టీడీపీ నేతను గెలిపిస్తే, తమపైనే కేసులు నమోదు చేయించాడని మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్ జగన్ కు అండగా నిలబడాలన్న ఉద్దేశ్యంతోనే తాము వైయస్సార్సీపీలో చేరామని తెలిపారు.