19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
టీడీపీ నేతలు వైయస్ఆర్ సీపీలో చేరిక
13 Jan 2018 11:05 AM
చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై విసుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలకు ఆకర్శితులవుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరినియోజకవర్గం రామచంద్రాపురం మండలం నెత్తకుప్పానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో జననేతను కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెత్తకుప్పం సర్పంచ్ బి.సుబ్రమణ్యయాదవ్, మాజీసర్పంచ్ సీ.సుబ్బరాయులు, వార్డు మెంబర్లు మునిశంకర్ నాయుడు, శ్రీనివాసులు, నీలమ్మ, ప్రభాకర్ నాయుడుతోపాటు వందమంది కార్యకర్తలకు వైయస్ జగన్మోహన్రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.