వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు

నందికొట్కూరు : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే ఐజయ్య సమక్షంలో గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బీరం కాంతారెడ్డి ఆధ్వర్యంలో బీరం శేషారెడ్డి, వెంకటరామిరెడ్డితో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్పీపీ  తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

Back to Top