మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పాదయాత్రకు వెళ్తే చంపేస్తాం
28 Nov 2017 12:44 PM
- కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల బెదిరింపులు
- లెక్క చేయని గ్రామీణులు
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. జననేత ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు పచ్చ నేతలు బెదిరింపులపర్వానికి దిగుతున్నారు. అయినా సరే జనం లెక్క చేయకపోవడంతో ఏమి చేయలో దిక్కుతోచక భౌతిక దాడులకు దిగుతున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు స్వచ్ఛందంగా బయలుదేరిన గ్రామీణులపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్దన్రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. పాదయాత్రకు వెళ్తే చంపేస్తామని బెదిరించినా, దాడులకు తెగబడినా గ్రామీణులు ఖాతరు చేయలేదు. యాత్రకు భారీగా తరలివెళ్లారు. విష్ణువర్ధన్రెడ్డి స్వగ్రామం ఎదురూరు, ఆయనకు పట్టున్న తొలిశాపురం, ఆర్.కొంతలపాడు, ఆర్.కె.దుద్యాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వైయస్ జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన కర్నూలు మండలం ఆర్.కొంతలపాడులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
పిడిగుద్దలు..కారు అద్దాలు ధ్వంసం
వైయస్ జగన్ పాదయాత్రకు వెళ్లిన గ్రామస్తులపై టీడీపీ నాయకులు పిడిగుద్దులు గుద్దారు. వాహనాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఆర్.కొంతలపాడుకి చెందిన వసంత్, రాజు, ప్రకాశ్, మాసుం, ఎల్లప్ప, చిన్న మద్దిలేటి, తెలుగు మద్దిలేటి, బాషా తదితరులు కోడుమూరులో ప్రజాసంకల్పయాత్రకు వెళ్లాలనుకున్నారు. ఇందు కోసం రెండు తుఫాన్ వాహనాలను మాట్లాడుకున్నారు. అయితే.. వాహనాలు బయల్దేరే సమయానికి కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డి.విష్ణువర్ధన్రెడ్డి అనుచరులు అక్కడికి వచ్చి.. దుర్భషలాడుతూ..నోటికొచ్చినట్లు తిట్టి..మేమొద్దన్నా పాదయాత్రకు వెళ్తార్రా’ అంటూ అదే గ్రామానికి చెందిన సర్పంచ్ సాయికృష్ణ, బోయ రామాంజనేయులు, ముచ్చెంకరెడ్డిలపై పిడిగుద్దులు కురిపించారు. వాహనాలపై బండరాళ్లతో దాడి చేశారు. డ్రైవర్ నరసింహులును చితక్కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు వారించే ప్రయత్నం చేయగా.. ‘మా విష్ణువర్ధన్రెడ్డికి నచ్చని పనులు ఎవరు చేసినా ప్రాణాలతో మిగలరు’ అంటూ హెచ్చరించారు. ఇలా ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు బీభత్సం సృష్టించారు. టీడీపీ నేతల తీరును ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీ దౌర్జన్యం ఎల్లకాలం సాగదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. టీడీపీ నేతలు తీరు మార్చుకోకపోతే ప్రజలు తిరుగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..