అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ

గుంటూరు: ప్రజల విశ్వాసం కోల్పోయిన అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. అర్బన్ బ్యాంకుకు సంబంధించిన రెండు డైరెక్టర్ల పదవులకు తాజాగా పదవీ కాలం ముగియడంతో తిరిగి ఎన్నికలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి వెళ్లిన వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పలువురు నేతలను టీడీపీ, బీజీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, బీజేపీ నేతలను ప్రతిఘటించిన వైయస్సాఆర్ సీపీ నేతలతో వారు వాగ్వాదానికి దిగారు. కొద్దిపాటి తోపులాట జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనుండటంతో వాటిని టీడీపీ, బీజేపీ పంచుకునేందుకు కుట్రలు చేస్తున్నాయి. 
Back to Top