టీడీపీ డిపాజిట్లు గ‌ల్లంతే

తిరుపతి : ఎప్పుడు ఎన్నిక‌లు జరిగినా తెలుగుదేశానికి డిపాజిట్లు పోవ‌టం ఖాయ‌మే అని మాజీమంత్రి, వైయ‌స్సార్సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అభిప్రాయ ప‌డ్డారు. టీడీపీకి గడ్డు రోజులు ప్రారంభమయ్యాయని  పేర్కొన్నారు. తిరుప‌తిలో మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డితో క‌లిసి మీడియాతో మాట్లాడారు.
 అందుకే మహానేత వైఎస్ఆర్ విగ్రహాలను పథకం ప్రకారం తొలగిస్తున్నారని చెప్పారు. ప్రజల్లో తమ పార్టీ పట్ల రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు.టీడీపీ పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  ఇటీవల చేపట్టిన గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా వెళ్లిన ప్రతి చోట చంద్రబాబుపై ప్రజలు మండిపడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు.
Back to Top