కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
టీడీపీ ఓటుకు నోటు రాజకీయాలు
31 Oct 2016 2:43 PM
విశాఖపట్నంః పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ ఓటర్లను ప్రలోభపెడుతూ అక్రమాలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో కొయ్య ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. నారాయణ, చైతన్య కాలేజ్ లలో ఓటు నమోదు చేస్తే ప్రాక్టికల్స్ లో మంచి మార్కులు వేస్తాము అంటూ మంత్రి నారాయణ విద్యార్థులను మభ్య పెడుతున్నారని , గీతం విద్యాసంస్థలలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఓటు నమోదుకు రూ.10 వేలు చొప్పున, ఎన్నికలలో ఓటు వేసిన తరువాత రూ.20 వేలు చొప్పున వెదజల్లేందుకు ఆశచూపుతున్నారని ప్రసాద్ రెడ్డి విమర్శించారు. అధికార దాహం కోసం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మీద ఎన్నికల అధికారి, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయకుండ ఈ రోజు ,రేపు అంటూ కాలయాపన చేస్తూ బాబు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అని ప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు.