అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
టీడీపీ పాలనలో పేదలకు అన్యాయం
07 Aug 2017 7:24 PM
వెంకటాచలం (నెల్లూరు): చంద్రబాబు నాయుడు పరిపాలనలో బడాబాబులకు తప్పితే పేదలకు న్యాయం జరగడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. పేదల పొట్టకొట్టి పెద్దలకు దోచిపెట్టడం వంటి దుర్మార్గ పనులు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్డే కార్యక్రమానికి హాజరైన కాకాణి మీడియాతో మాట్లాడారు. అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా మారిపోయారన్నారు. గ్రీవెన్స్ డే లో ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. ఇళ్లస్థలాలు, ఫించన్లు, రేషన్కార్డులు కోసం నెలల తరబడి ప్రభుత్వం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుంటుందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందజేసేందుకు గ్రామసభల ద్వారా చేయల్సి ఉంటే, జన్మభూమి కమిటీల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అధికారులు టిడిపి నాయకులకు తొత్తులుగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పొసుపు కుంభకోణంలో వీర్వోలు బలైనట్లు పంచాయతి కార్యదర్శలు బలికావద్దని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లబ్దిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా చేయాలని గ్రామ కార్యదర్శులకు సూచించారు. జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకు అధికారులు పనిచేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.