రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
టీడీపీ..కాంగ్రెస్ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
18 Apr 2018 10:11 AM
కర్నూలు: జిల్లాలో వలసలు మొదలయ్యాయి. అధికార టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీలను వీడి వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం గంజెళ్ల గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆ పార్టీలకు గుడ్బై చెప్పారు. ప్రజల పట్ల అంకిత భావం చూపే వైయస్ జగన్ నాయకత్వం, ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ నికర వైఖరి పట్ల తామంతా ఆకర్షితులమై మేము సైతం పార్టీకి అండగా నిలవాలని ముందుకు కదిలామంటూ ముక్తకంఠంతో నినదించారు. ఎంపీపీ నసురుద్దీన్, తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి సమక్షంలో వీరంతా వైయస్ఆర్సీపీలో లాంఛనంగా చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ పోరాటాలను గుర్తించి అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఆ పార్టీల విధానాలు, వైఖరులు నచ్చకే వీరంతా పార్టీలో చేరారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్ల మందిని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేత వైయస్ జగన్పై ప్రజలకు అపార నమ్మకం ఉందని, పాదయాత్రల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా వేలాది మంది ఆయనను అనుసరించడమే అందుకు నిదర్శనమన్నారు. అధికారంలోకి వస్తే తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కంటే మంచి పాలన అందించి చరిత్ర సృష్టిస్తారని స్పష్టం చేశారు. రాబోయే సుపరిపాలన కోసం మనమంతా సైనికుల్లా పనిచేసి వైయస్ జగన్ను ముఖ్యమంత్రి చేసేవరకు శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో వెంకట్రాముడు, శాంతన్న, మల్లేష్, శ్రీనివాసులు, రంగస్వామి, గోపాల్, యంకన్న, చంద్ర, పెద్దయ్య, నాయుడు, గోరిల్లా, రాఘవేంద్ర, నాగార్జున, జయరాముడు, ఉరుకుందు, విజయ్, నాగరాజు, కృష్ణ, బారికి పరమేష్లతో పాటు మరి కొందరు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బీఆర్ బసిరెడ్డి, ధర్మకారి నాగేశ్వరరావు, బందెనవాజ్ తదితరులు ఉన్నారు.