కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబుకు అప్పుడు ఎంత చెప్పినా వినలేదు
04 Dec 2013 2:34 PM
హైదరాబాద్:
కృష్ణా జలాల కోసం ఎన్టీఆర్ 11 ప్రాజెక్టులు చేపడితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాటిని మూలన పడేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆ ప్రాజెక్టులు కట్టకపోతే శాశ్వతంగా నష్టం కలుగుతుందని అప్పట్లో చంద్రబాబుకు ఎంత చెప్పినా వినలేదని ఆయన గుర్తు చేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉండగా, చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, మిగులు జలాలపై హక్కు లేదని సుప్రీంకోర్టు ఆనాడే తీర్పు ఇచ్చిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని నిందించడం దారణమని తమ్మినేని ఖండించారు. కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు వల్లే అన్యాయం జరిగిందని, దీనిపై టీడీపీ నేతలతో ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధమని తమ్మినేని సీతారాం సవాల్ చేశారు.