కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
లక్షల కోట్ల దోపిడీ కోసమే
12 Sep 2016 1:37 PM
హైదరాబాద్ః లక్షల కోట్ల దోపిడీ కోసమే చంద్రబాబు ఎలాంటి పారదర్శకత లేని స్విస్ ఛాలెంజ్ విధానం తీసుకొచ్చారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అది స్విస్ ఛాలెంజ్ కాదని సూట్ కేసుల ఛాలెంజ్ అని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని...రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని తమ నాయకుడు వైయస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారని తెలిపారు. రాజధాని పేరిట రైతుల భూములను దోచుకొని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడాన్ని భూమన తీవ్రంగా తప్పుబట్టారు.