కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష

కర్నూలు, 19 ఆగస్టు 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమరదీక్షకు ‌మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి సోమవారంనాడు కర్నూలులో ఆమరణ దీక్ష ప్రారంభించారు. వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంక‌ట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చరిత మద్దతు తెలిపారు. కాగా, వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి పిలుపుతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కార్యకర్తలు విజయమ్మ సమరదీక్షకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

Back to Top