వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పట్టిసీమతో ఒరిగేదేమీలేదు..!
16 Sep 2015 6:57 PM
కర్నూలుః టీడీపీ ప్రభుత్వం బడాయి కోసమే నధుల అనుసంధానం నాటకం ఆడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అధికారపార్టీ చేపట్టిన పట్టిసీమ కేవలం కృష్ణాడెల్టాకు నీరందించడం కోసమేనని..దానివల్ల రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రాయలసీమలోని నధులను అనుసంధానం చేస్తేనే సీమ సస్యశ్యామలం అవుతుందన్నారు.
నధుల అనుసంధానం గతంలోనే కాటన్ దొర ప్రారంభించారని...అదేదో తామే చేసినట్లు టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం పట్టిసీమ డ్రామాలాడుతున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండకముందే నీటిని వదిలి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని....కర్నూలు జిల్లా పరిషత్ లో జరిగిన నధుల అనుసంధాన సదస్సులో మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.