బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
వైయస్ జగన్ను కలిసిన విద్యార్థి విభాగం నేతలు
02 Feb 2017 7:58 PM
మడకశిర: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని మడకశిర నియోజకవర్గం వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు గురువారం బెంగళూరు ఎయిర్పోర్టులో కలిశారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల, కళాశాల కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయాలని వైయస్ జగన్ తమకు సూచించారని జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి డీ మంజునాథ్ తెలిపారు. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి గెలుపునకు కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు. వైయస్ జగన్ను కలిసిన వారిలో విద్యార్థి నాయకులు రంగనాథ్, కాంతరాజు, గిరీష్, రామ్కిశోర్రెడ్డి, హిందూపురం యువ నాయకుడు ఉపేంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.