మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
దుర్గారావుది ప్రభుత్వ హత్యే
26 Jul 2018 1:29 PM
అనంతపురం: వైయస్ఆర్సీపీ కార్యకర్త దుర్గారావుది ప్రభుత్వ హత్యేనని వైయస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ నాయకులు మండిపడ్డారు. ప్రత్యేక హోదా పోరాటంలో అమరుడైన వైయస్ఆర్సీపీ కార్యకర్త దుర్గారావు మృతికి సంతాపంగా గురువారం అనంతపురం పట్టణంలో వైయస్ఆర్సీపీ విద్యార్థి యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్ఆర్సీపీ ఈ నెల 24న బంద్ నిర్వహిస్తే..చంద్రబాబు పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించారన్నారు. దీంతో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని వారు విమర్శించారు. కేసుల భయంతో చంద్రబాబు హోదానను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని చంద్రబాబు అణచాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అన్నారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని ఉద్యమాన్ని ఉక్కుపాదం మోపారన్నారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.