కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మోసగాడి పాలనలో అన్యాయమైపోయాం..!
15 Sep 2015 4:09 PM
తిరుపతిః చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓమోసగాడి పాలనలో తాము తీవ్రంగా మోసపోయామని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన యువభేరి సదస్సులో ఓ విద్యార్థి ఆవేదన వెళ్లగక్కాడు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని విస్మరించి మోసం చేశాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన అవగాహన సదస్సులో తేజస్ అనే విద్యార్థి వాపోయాడు.
రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, యువకులకు ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మాటలు విని తనలాంటి విద్యార్థులు, తమ కుటుంబసభ్యులు, రైతులు ఇలా అందరూ అన్యాయమైపోయారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చే వరకు విద్యార్థిలోకం విశ్రమించబోదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాడుతామని స్పష్టం చేశారు.