వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు-నల్లపురెడ్డి
26 May 2016 8:24 AM
నెల్లూరు : వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనివైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. హోదా సాధించడం చంద్రబాబుకు చేత కాకుంటే తప్పుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అందరినీ కలుపుకొని హోదా కోసం పోరాడుతుందన్నారు. ప్రత్యేక హోదా, తెలంగాణా అక్రమ ప్రాజెక్టులు ఈ రెండు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందుకు వైఎస్సార్సీపీ మద్దుతు ఇస్తుందన్నారు.
నెల్లూరు జిల్లా కోటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రత్యేక హోదా, తెలంగాణా అక్రమ ప్రాజెక్టుల విషయాల్లో ప్రధాని మోదీతో, సీఎం కేసీఆర్తో బాబు రాజీ ధోరణి అవలంబిస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే రాష్ట్రానికి హోదా రాకుండా ఆయనే అడ్డుపడుతున్నారేమోననే అనుమానం కలుగుతోందన్నారు. రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయన్నారు. ప్రధాని కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పసిగట్టి చంద్రబాబును పక్కన పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు.
బీజేపీపై తెలుగు తమ్ముళ్ల విమర్శల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని ప్రసన్న ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత ఆ పార్టీపై విమర్శలు చేయిస్తూ డ్రామాలాడుతున్నాడన్నారు. మినీ మహానాడులు కుమ్ములాటలకు వేదికగా మారాయన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఎస్టీలకు, మైనార్టీలకు ప్రాధాన్యత లేదన్నారు.