వైఎస్ జగన్ సీఎం అయితేనే ప్రగతి

వైఎస్సార్ జిల్లా) రాష్ట్రానికి  వైఎస్
జగన్ ముఖ్యమంత్రి అయితేనే సర్వతోముఖంగా ప్రగతి సాధించవచ్చని ప్రజలు
భావిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.
వైఎస్సార్ జిల్లాలో ఆయన పర్యటించి పలు అభివ్రద్ధి పనుల్ని ప్రారంభించారు. ఈ
సందర్భంగా ఆయన మీడియాతో మాటలాడారు. డబ్బు పెట్టి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను
కొన్నంత మాత్రాన చంద్రబాబు బలపడతారు అనుకొంటే అది అపోహ మాత్రమే అని ఆయన అన్నారు.
ఎమ్మెల్యేల సంఖ్యాబలం తగ్గినప్పటికీ వైఎస్సార్సీపీకి ప్రజా బలం మాత్రం పెరుగుతూనే
ఉందని అవినాష్ రెడ్డి అన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top