వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఆ సంతకాలతో చరిత్రను మారుస్తా
05 Mar 2014 1:26 PM
నిడదవోలు (ప.గో.జిల్లా):
‘ఓట్లు, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఏ గడ్డి అయినా తినే పరిస్థితులను ఇప్పుడు చూస్తున్నాం. ఓట్లు, సీట్ల కోసం దొంగ కేసులు పెట్టడానికి, ఒక వ్యక్తిని జైలు పాలు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయం అంటే ప్రతి పేదవాడి గుండెల్లో చిరునవ్వు చూడాలి. ఈ వ్యవస్థలో మార్పును తీసుకొస్తాం. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడదాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున నాలుగు సంతకాలు పెడతా. ఈ సంతకాలు రాష్ట్ర చరిత్రను మారుస్తాయి. మొదటి సంతకం అక్కచెల్లెళ్ల పిల్లలను చదివించే ‘వైయస్ఆర్ అమ్మ ఒడి’ పథకం గురించి చేస్తా. ఈ పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో విద్యార్థికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.1000 వేస్తాం. రెండో సంతకం అవ్వా తాతల కోసం పెన్షన్ను రూ.700 పెంచడానికి చేస్తా. మూడో సంతకం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం చేస్తా. నాలుగో సంతకం అక్కచెల్లెమ్మల డ్వాక్రా రుణాల మాఫీ కోసం చేస్తాం’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు గణేశ్చౌక్ సెంటర్లో మంగళవారం జరిగిన ‘వైయస్ఆర్ జనభేరి’ సభలో ఆయన మాట్లాడారు.
బాబు పాలన భయంకరం :
‘మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణించి ఐదేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ ఆయన ఎక్కడున్నారని ఎవరినైనా అడిగితే గుండెలు చూపించి మా గుండె లోతుల్లో ఉన్నాడని చెబుతారు. రామరాజ్యం నేను చూడలేదు కానీ ఆ దివంగత నేత సువర్ణయుగాన్ని మాత్రం చూశాను. ఆ దివంగత నేతకు ముందు రాష్ట్రాన్ని చంద్రబాబు పాలించేవారు. ఆ భయానక పాలనలో గ్రామాలకు వెళ్లినప్పుడు అవ్వా తాతలు.. అయ్యా పెన్షన్ ఇప్పించమని అడిగేవారు. వారి కష్టాలు చూడలేక అధికారులకు ఫోన్ చేస్తే.. గ్రామంలో 15 మందికో, 20 మందికో ఉన్న కోటా పూర్తయిందని వారిలో ఎవరైనా చనిపోతే గానీ కొత్త వారికి పెన్షన్ ఇవ్వలేమని చెప్పడం నాకు గుర్తుంది. పిల్లలు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా వారిని చంద్రబాబు సీఎం స్థానంలో ఉండి ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. హఠాత్తుగా ఎవరికైనా గుండెనొప్పో, ఇంకో రోగమో వస్తే ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు ఫీజు అడిగేవారు. ఆ కుటుంబ సభ్యులు ఎంత వడ్డీకైనా అప్పుతెచ్చి కట్టేవారు. కానీ దాన్ని తీర్చడానికి జీవితాంతం వారు ఊడిగం చేయడం నాకు గుర్తుంది' అని శ్రీ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.
అన్నదాతల ఆత్మహత్యల్ని అవహేళన చేశారు :
'ఓట్లు, సీట్ల కోసం డ్వాక్రా అక్క చెల్లెళ్లను చంద్రబాబు ఉపయోగించుకున్నారు. విశ్వసనీయత అంటే అర్థం తెలియని రోజులవి. పంటలు పండక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని అవహేళన చేశారు. రైతుల కోసం ఉద్యమాలు జరిగాయి. అప్పుడు రైతన్నల రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని, నష్టపరిహారం ఇప్పించాలని అడిగితే.. అలా చేస్తే ఆ డబ్బుల కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని, తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎగతాళి చేశా'రని అన్నారు.
వెలుగు రేఖలా వైయస్ఆర్ వచ్చారు :
'ఆ భయంకర పాలన సమయంలో దివంగత మహానేత వైయస్ఆర్ వెలుగు రేఖలా వచ్చారు. ప్రతి పేదవాణ్ణి పేదరికం నుంచి బయట పడేయడానికి ఆయన ముందుకొచ్చారు. ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా ఇంజినీరో, డాక్టరో కావాలని కలలు కన్నారు. ఆ పిల్లల ఫీజులు ప్రభుత్వమే కట్టేలా చేశారు. పేదవాడికి రోగం వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. అప్పులు తెచ్చి రూ.2 లక్షలు కట్టాల్సిన పరిస్థితి లేకుండా చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపేలా చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. పేదవాడికి గుండెపోటు వస్తే 108 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు కుయ్.. కుయ్.. కుయ్మని అంబులెన్సు వచ్చేది. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పేదల కోసం ఎవరైనా పనిచేశారంటే ఆయన దివంగత మహానేత రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశా'రని ఆవేదన వ్యక్తం చేశారు.