టీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
ప్రత్యేక హోదా ఇప్పించాల్సిందే..!
10 Mar 2016 11:03 PM
ఢిల్లీ: లోక్ సభ లో ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రమే హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంపై ఏపీకి కేంద్రం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని లోక్ సభలో డిమాండ్ చేశారు. రైతులకు 100 శాతం రుణాలు ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని వ్యాఖ్యానించారు. 2018 లోగా పోలవరం నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పుడు ఇస్తున్న నిధుల కేటాయింపులు సరిపోవు అని పేర్కొన్నారు. జన్ ఔషధ్ కేంద్రాల ఏర్పాటు అనుకున్న లక్ష్యాలకు తగ్గట్లుగా లేవని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభలో ఈ సమస్యలను లేవనెత్తారు.