రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మార్మోగిన ప్రత్యేక హోదా నినాదం
06 Jan 2018 2:05 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో ప్రత్యేక హోదా నినాదం మార్మోగింది. శనివారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని యువకులు కలిశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైయస్ జగన్ను కోరారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని వారు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ స్పందించారు. ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు తీసుకువస్తానని తిరుపతిలో హామీ ఇచ్చిన చంద్రబాబు తన ఓటుకు కోట్లు కేసు కోసం తాకట్టు పెట్టారన్నారు. వైయస్ఆర్సీపీ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా సాధనకు గల్లీ నుంచి ఢిల్లీదాకా పోరాటం చేసిందని, తిరుపతి వేదికగా యువభేరినిప్రారంభించి యువత, విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతానని, అందుకు యువకులు తనకు మద్దతుగా నిలవాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.