కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక హోదా బస్సు
02 Mar 2018 1:53 PM
అనంతపురం: మార్చి 5న ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. ప్రత్యేక హోదా బస్సుకు వైయస్ఆర్సీపీ నాయకులు వైటీఆర్ శివారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు అని, ఇది ఎవరి భిక్ష కాదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్ రాజీ లేని పోరాటాలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 1న కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టి మా ఆకాంక్షను తెలిపామన్నారు. అలాగే ఢిల్లీ వీధుల్లో హోదా కోసం పోరుబాట పట్టనున్నట్లు చెప్పారు. అప్పటికి దిగిరాకపోతే ఏప్రిల్ 6న మా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని మా నాయకుడు వైయస్జగన్ ప్రకటించినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.