రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
06 May 2016 7:49 PM
హైదరాబాద్) తెలంగాణ
వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం టీ ఆర్ ఎస్ లో విలీనం అయినట్లుగా స్పీకర్ మధుసూదనాచారి
బులెటిన్ ఇవ్వటం అనైతికం అని, రాజ్యాంగ విరుద్ధం అని వైయస్సార్సీపీ తెలంగాణ విభాగం
నాయకులు కేవీ రాఘవరాడ్డి, శివకుమార్ పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు
మరొక పార్టీలో చేరటాన్ని రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోందని, వందకు వంద శాతం
సభ్యులు వేరొక పార్టీలో చేరినా వారి చర్య రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొన్నారు.
స్పీకర్ నిర్ణయానికి ఉన్న రాజ్యాంగబద్ధత ఏమిటో స్పీకరే వెల్లడించాలని డిమాండ్
చేశారు. శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ విలీనం అయినట్లు కాదని,
ఇటువంటి అనైతిక చర్యలకు తావివ్వటం అంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం
లేకపోవటమే అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తున్నామని వారు స్పష్టం
చేశారు.