రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
ఆదిలాబాద్, నిజామాబాద్లలో విజయమ్మ పర్యటన
02 Jul 2013 10:11 AM
ఆదిలాబాద్, 2 జూలై 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారంనాడు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారంనాడు ఇచ్చోడలో జరిగిన పార్టీ స్థానిక ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న శ్రీమతి విజయమ్మ రెండవ రోజు కూడా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె గుండంపల్లిలో హైలెవల్ కెనాల్ నిర్మాణంపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలుపుతారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గతంలో ఈ కెనాల్ కోసం వేసిన శిలాఫలకానికి జలాభిషేకం, క్షీరాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీమతి విజయమ్మ నిజామాబాద్లో పర్యటనకు వెళతారు.