మహానేత లేని లోటు జగన్‌బాబు తీరుస్తారు

విశాఖపట్నం:

‘మహానేత రాజశేఖరరెడ్డిని పోగొట్టుకున్నాం.. ఆ లోటు నాకు చచ్చేంత వరకు తీరేది‌ కాదు. ప్రజలకు మాత్రం వైయస్ఆర్ లేని లోటు జగన్‌బాబు తీరుస్తారు. మీ సంతోషాల్లో, బాధల్లో మీ వెన్నంటి ఉండి, మీ అందరికీ తోడుగా నిలుస్తారు. వైయస్ఆర్ ఆశయాల సాధన జగన్‌బాబుతోనే సాధ్యం’ అని ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభా స్థానం నుంచి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి శ్రీమతి వైయస్‌ విజయమ్మ భరోసా ఇచ్చారు. విశాఖ లోక్‌సభాస్థానం అభ్యర్థిగా ఆమె గురువారం నామినేషన్ వేశారు.‌ కుమార్తె శ్రీమతి షర్మిల, అల్లుడు బ్రదర్ అని‌ల్ కుమార్, పార్టీ రాజకీయ వ్యవహారాల‌ కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సీనియర్ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వెంటరాగా ఆమె కలెక్టరే‌ట్‌లో జిల్లా ఎన్నికల అధికారి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. అంతకు ముందు‌ శ్రీమతి విజయమ్మ జగదాంబ కూడలిలో వైయస్ఆర్ విగ్రహానికి అంజలి ఘటించారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలను‌ ఉద్దేశించి ప్రసంగించారు.

'విశాఖపట్నం అంటే మహానేత రాజశేఖరరెడ్డికి ఎంతో ఇష్టం. ఇక్కడి ప్రజలన్నా.. సముద్రం, కొండలు, ప్రకృతి అన్నా మరీ ఇష్టం. విశాఖ ప్రజలు ఎంతో మంచివారని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా.. రాత్రిళ్లు విశాఖలోనే ఉండేవారు. విశాఖను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. ఆయన ఆశయాలు, జగ‌న్‌బాబు కోరిక మేరకే విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు మీ ముందుకు వచ్చాను. మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను’ అన్నారు.

మనసున్న నాయకుడినే ఎన్నుకోండి :
‘ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే నెల 7న మన తలరాతలు మార్చే ఎన్నికలు జరగనున్నాయి. మంచి నాయకుడిని, మనసున్న నాయకుడిని, మీ గుండె చెప్పిన విశ్వసనీయత ఉన్న నేతను ఎన్నుకోండి. రాజశేఖరరెడ్డి ఆ రోజు అంతా మనవాళ్లే అనుకుని పనిచేశారు. కుల, మత, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో కరెంట్, ఆర్టీసీ, నీటి చార్జీలు పైసా కూడా పెంచలేదు. ప్రపంచంలోనే ఇది రికార్డు. ఆరోగ్యశ్రీ పథకంలో కోటిమందికి పైగా లబ్ధి పొందారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు. ప్రతి జిల్లా, ప్రతి వ్యక్తి గురించీ ఆలోచించి పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఒక తండ్రి, ఒక అన్న, ఒక తమ్ముడు ఉంటే ఏం చేస్తారో.. అదే స్థాయి లో పేదవాళ్ల కోసం ఆయన అన్నీ చేశారు’ అని విజయమ్మ అన్నా రు.

వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా విశాఖ లోక్‌సభా స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ‌శ్రీమతి విజయమ్మకు నగరవాసులు అడుగడుగునా నీరాజనం పట్టారు. దివంగత మహానేతను గుర్తుచేసుకుని కొందరు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు.

Back to Top