బాబుకు చీపుర్లు చూపించండి

అనంతపురం: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఐదోరోజు ఆదివారం ఓబులదేవరచెర్వులో వైయస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. మోసం చేసినా, జేబులు కొట్టినా 420 కేసులు పెడతారని, మోసం చేసి సీఎం పదవిలో కూర్చున్న చంద్రబాబును ఏం చేయాలని, ఆయనపై ఎలాంటి కేసు పెట్టాలని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 


'మోసం చేస్తున్న చంద్రబాబును నిలదీయకూడదట, అడగకూడదట. ఆయన మాత్రం మోసం చేయొచ్చంట. ఏమైనా చేయొచ్చంట. అలాంటి వ్యక్తికి జ్ఞానోదయం కావాలంటే ఏం చేయాలి? చంద్రబాబుకు చెప్పులు చూపించడం ఇష్టంలేదట. ఈ సారి చెప్పులు కాదు.. చీపుర్లు చూపించండని ప్రజలకు పిలుపునిచ్చారు.  చంద్రబాబు సర్కార్ను బంగాళాఖాతంలో కలిపేవరకు ఉద్యమిద్దామని అన్నారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేయాలి. ప్రభుత్వం పనిచేయాలంటే ప్రజలు నిలదీసే పరిస్థితి రావాలి' అని వైయస్ జగన్ అన్నారు.
Back to Top