మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అక్రమ కట్టడాలని నిలిపివేయాలి
18 Feb 2017 5:35 PM
విశాఖ: మునగపాక మండలంలోని పల్లపు ఆనందపురం గ్రామంలో గెడ్డపోరంబోకు స్థలంలో అక్రమ కట్టడాలను నిలుపదల చేయాలని కోరుతూ శనివారం తహశీల్దార్ రాంబాబు దృష్టికి పల్లపు ఆనందపురం వైయస్ఆర్సీపీ నేతలు తీసుకువచ్చారు. గ్రామంలో గెడ్డపోరంబోకు స్థలంలో కొంతమంది పక్కా ఇళ్లపేరిట అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని అధికారులు స్పందించి పనులను నిలుపుదల చేయాలని కోరారు. పంచాయతీ పరమైన కార్యకలాపాలు చేపట్టేందుకు అనువుగా సంబందిత స్థలాన్ని పరిశీలిస్తుంటే అదేస్థలంలో కొంతమంది అక్రమకట్టడాలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే పనులను ఆపించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన తహశీల్దార్ రాంబాబు మాట్లాడుతూ గెడ్డపోరంబోకు స్థలాన్ని కాపాడాల్సిన అధికారం నీటిపారుదల శాఖ అధికారులకు ఉందన్నారు. ఈవిషయాన్ని ఆర్డీవో పద్మావతి దృష్టికి తీసుకువెళతానన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో అల్లవరపు రమణబాబు, క్రరి పెదబ్బాయి తదితరులున్నారు.